తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా

 

గోల్డెన్ న్యూస్ / ఆంధ్ర ప్రదేశ్ : తిరుమల కొండపై నుంచి తిరుపతికి వస్తున్న ఓ కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో మొదటి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది.

 

సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు.

 

ప్రమాదానికి గురైన వాహనానికి ముందు వెనుక వాహనాలు లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు వివరించారు. కారును అధికారులు తిరుపతికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram