తెలంగాణ రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా సైబర్ నేరగాళ్లు రాష్ట్ర పోలీస్ వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. ఒక బెట్టింగ్ సైట్ ముఠా.. నగరంలోని పోలీస్ కమిషనరేట్ల వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు తెలుస్తుంది. దీని ఫలితంగా, గత పది రోజులుగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల వెబ్సైట్లు సరిగా పనిచేయడం లేదు. ఈ కమిషనరేట్ల వెబ్సైట్లను తెరవడానికి ప్రయత్నించినప్పుడు అవి ఆటోమేటిక్గా బెట్టింగ్ యాప్ వెబ్సైట్లకు రీ-డైరెక్ట్ అవుతున్నాయి. ఇది సైబర్ భద్రత విషయంలో ఆందోళన కలిగించినప్పటికీ, సమస్యను గుర్తించిన ఐటీ విభాగం వెంటనే స్పందించింది. ప్రస్తుతం, హ్యాకింగ్కు గురైన ఆయా సర్వర్లను పూర్తిగా డౌన్ చేయడం జరిగింది. తద్వారా పౌరులు ఇకపై బెట్టింగ్ సైట్లకు దారి మళ్లించబడకుండా నివారించారు. ఈ చర్య ద్వారా అధికారులు వెబ్సైట్లను పునరుద్ధరించి, భద్రతా లోపాలను సరిచేసే పనిని ప్రారంభించినట్లు తెలుస్తుంది. కాగా పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్ సైట్ల హ్యాకింగ్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది









