వందేభారత్‌ స్లీపర్‌.. ప్రారంభించిన మోదీ

తొలి వందేభారత్‌ స్లీపర్‌.. ప్రారంభించిన ప్రధాని మోదీ

 

ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా- అస్సాంలోని గువాహటి (కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించనుంది. అదేవిధంగా ఏడు అమృత్‌ భారత్ రైళ్లను ప్రారంభించారు. స్థానికంగా వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram