బస్సు బోల్తా నలుగురు మృతి

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్‌ బస్సు బోల్తాపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఇందల్వాయి మండలం గన్నారం వద్ద గల 44 జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగింది. హైదరాబాద్‌ నుంచి 22 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదవాశాత్తు బోల్తాపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram