పురుగుల మందు తాగిన సర్పంచ్.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం

గోల్డెన్ న్యూస్/ కడెం / నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి ఆత్మహత్యాయత్నం చేయడం.. ఆపై ఆసుపత్రికి తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట. సర్పంచ్ లహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. లహరిని తీసుకువెళ్తున్న కారు వేగంగా వెళ్తూ మార్గమధ్యలో అదుపు తప్పింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినగా.. లహరి పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచారు. ఒకే రోజు అటు ఆత్మహత్యాయత్నం, ఇటు రోడ్డు ప్రమాదం జరగడంతో మాసాయిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సర్పంచ్ లహరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలేంటి? ప్రమాదం ఎలా జరిగింది? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram