⇒రేగులగండి చెరువు వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
గోల్డెన్ న్యూస్ / మణుగూరు /మండలంలోని కూనవరం పంచాయతీ పరిధిలో రేగులగండి చెరువు వద్ద భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ… కొండల మధ్య ప్రకృతిలో చూసేందుకు సుందరంగా ఉన్న ఈ చెరువు లోతును ఊహించక కొందరు మద్యం మత్తులో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఇద్దరు మృతి చెంది వారి కుటుంబాలకు తీరని ఆవేదనను మిగిల్చారన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు ఏ కుటుంబానికి జరగరాదనే ఉద్దేశ్యంతో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రమాదకరంగా ఉన్న చెరువు ముందు భాగంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Post Views: 15








