గ్రామ సమాఖ్య భవన నిర్మాణం కొరకు భూమి పూజ

 

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక భాగంగా 

⇒ ఇందిర మహిళా వారోత్సవాలు 

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / ప్రజా పలన ప్రగతి ప్రణాళికలో భాగంగా  ఈరోజు (సోమవారం)  కరకగూడెం మండలం లో గ్రామ సమాఖ్య భవన నిర్మాణం చేపట్టుటకు భూమి పూజ లు నిర్వహించడం జరిగింది,

చిరుమల్ల గ్రామ పంచాయతీ లోని పోలకమ్మ తోగు, రాయనపేట, రేగళ్ల గ్రామ పంచాయతీ లో, భూమి పూజ చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో చిరుమల్ల గ్రామపంచాయతీ సర్పంచ్ కొమరం సుగుణ, రేగళ్ల జి పి సర్పంచ్ బాడిశ సుగుణ అధ్యక్షతన జరిగింది, ఈ కార్యక్రమం లో ఎమ్ పి డివో దేవ వర కుమార్, తహసీల్దార్ వట్టం కాంతయ్య, ఏ పి ఎమ్ బి వినోద్ క్రాంతి, ఏ ఈ వెంకటేశ్వర్లు, మండల సమాఖ్య అధ్యక్షులు పోలేబోయిన సరస్వతి,జిపి కార్యదర్శులు రామకృష్ణ,త్రి నాద్,, సీసీ లు విజయలక్ష్మి, సత్యనారాయణ, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ పెద్ద లు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram