రైల్వే జనరల్ టికెట్తో స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణిస్తే జరిమానా
రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం నిబంధనలను కఠినతరం చేసింది. జనరల్ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వ్ చేయని కోచ్లలోనే ప్రయాణించాలి. స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించాలంటే తప్పనిసరిగా రిజర్వేషన్ చేయించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తే రూ.250, ఏసీ కోచ్లో ప్రయాణిస్తే రూ.440 వరకు జరిమానా విధించబడుతుంది
ప్రయాణికులు ఈ నిబంధనలను పాటించి,ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించాలని సూచించారు.ఐతే సీట్లు ఖాళీగా మాత్రం ఉంటే టీటీఈ కి అదనపు రుసుము చెల్లించి టికెట్ ను అప్ గ్రేడ్ చేయించుకోవచ్చు అని రైల్వే శాఖ తెలిపింది.
Post Views: 22








