ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్..!

పన్నెండు మందిపై కేసులు

 

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.!

 

బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలపై ఫైనల్ ఇయర్కు చెందిన 12మంది విద్యార్థులపై కేసు నమోదైంది.

 

కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్సంగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు సుల్తాన్బజార్ పోలీసులు TG ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

కాలేజ్ యాజమాన్యం ర్యాగింగ్కు పాల్పడిన స్టూడెంటు 6నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు, ఈ 12 మంది కాక ఇంకెవరి హస్తమైనా ఉందా అనే విషయం లోతు గా ఆరా తీస్తున్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram