అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

అనాథలైన ఇద్దరు చిన్నారులు

 ఇల్లు అమ్మినా తీరని అప్పులు

 

గోల్డెన్ న్యూస్ / నిజామాబాద్/ కేంద్రంలో విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ భార్య మేఘన(34), పిల్లలు అయాన్ష్(9), మిథున్(7)లతో కలిసి నివసిస్తున్న నరేష్(38) అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం రూ.90 లక్షలు అప్పు చేసి సొంత ఇల్లు కొనుక్కున్న నరేష్ దంపతులు

 

ఇంటిపై రుణం వస్తే అప్పు తీర్చేద్దాం అనుకున్న నేపథ్యంలో, రుణం రాకపోవడంతో ఇల్లు అమ్మేసి కొంత అప్పు తీర్చిన నరేష్

 

ఇంకా మిగిలి ఉన్న అప్పు గురించి నరేష్ ఆందోళనలో ఉన్నట్టు, మానసిక వైద్యుడి వద్ద చికిత్స కూడా తీసుకుంటున్నట్టు తెలిపిన బంధువులు

 

ఈ నేపథ్యంలో పిల్లలు స్కూల్‌కు వెళ్లగానే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న నరేష్, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన మేఘన

 

మేఘన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Facebook
WhatsApp
Twitter
Telegram