నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో చోటు చేసుకుంది.
పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ విధులు నిర్వహిస్తున్న కల్లు రూపారెడ్డి(48) భర్త రాజేందర్రెడ్డితో కలిసి జేబీ కాలనీలో నివాసముంటున్నారు. వారికి హైదరాబాద్లో కూడాసొంతిల్లు ఉండటం, వారి కుమారుడుఅభినవ్ రెడ్డి హైదరాబాద్ లో ఇంజినీరింగ్ విద్య చదువుతుండటంతో తరచూవారు హైదరాబాద్ వెళ్తుంటారు. గతశనివారం నుంచి వరుసగా మూడురోజులు సెలవులు ఉండటంతో రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్
వెళ్లారు. భర్తకు హైదరాబాద్లో పనిఉండటంతో ఆమె ఒక్కరే మంగళవారంఉదయం కొండమల్లేపల్లి వచ్చి పాఠశాలకు హాజరయ్యారు.
నిత్యంసాయంత్రం ఆరున్నర వరకు పాఠశాలలోనే ఉండేవారు. కానీ మంగళవారం
తమ ఇంటికి స్నేహితులు వస్తున్నారని
చెప్పి సాయంత్రం 5.25 గంటల సమయంలో పాఠశాలకు సమీపంలోనే ఉన్న
వారి ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం భర్త ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్లి చూడమని చెప్పారు. సదరు వ్యక్తులు వచ్చి ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో విష యాన్ని తిరిగి అత నికి ఫోన్ ద్వారా తెలి పారు. దీంతో ఆందో ళనకు గురైన భర్త రాజేందర్రెడ్డి తమ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న చింత పల్లి ఎస్సై రాంమూర్తికి ఫోన్ చేసి తమ ఇంటికి వెళ్లి చూడాల్సిందిగా కోరాడు. సదరు ఎస్సై, ఇంటి పక్కల వారితో కలిసి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి భర్తకు సమాచారమిచ్చారు. ఆమె శరీరంపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు సమాచారం.









