ఆర్టీసీ సర్వీస్ బస్సులను ప్రయాణికులను సద్వినియోగం చేసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని ఆర్టీసీ డిపో లో నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మొదలై 100 రోజుల్లోనే ఏడు బస్సులను ప్రారంభించామన్నారు. రాయదుర్గం – శ్రీశైలం – హైదరాబాద్ సుదూర ప్రాంతాలకు వెళ్లే హైటెక్ బస్సులు,ఎక్స్ప్రెస్ సర్వీస్ బస్సులను ప్రారంభించారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుగుణంగా అధిక బస్సులను రాయదుర్గం డిపోకు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ప్రయాణికుల కొరకు ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. పాత బస్టాండ్ ను నూతన బస్టాండ్ ను రూపు రేఖలు మార్చేందుకు రూపకల్పన చేస్తామన్నారు.
Post Views: 29