ట్రాక్టర్ తిరగపడి రైతు మృతి

గోల్డెన్ న్యూస్ రామన్నపేట: యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ (తిరగపడి)ఇంజన్ మీద పడి రైతు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన పెద్దగోని నర్సింహ (54) గ్రామ శివారులోని కాటేపల్లి మహేశ్ పొలం దున్నుతుండగా నాగలి మధ్య ఇరుక్కుపోయి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram