బాల మేళా తో విద్యార్ధుల సామర్ధ్యాలు అంచనా
– ఎం.ఈ.ఓ జి మంజుల
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం: అక్షరాస్యత,సంఖ్యాశాస్త్ర పునాది కార్యక్రమంతో విద్యార్ధులు అభ్యసించిన అంశాలను ప్రదర్శించేందుకు అంచనా వేసేందుకు బాల మేళా చక్కని వేదిక అని ఎం.ఈ.ఓ మంజుల అన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ వినూత్న కార్యక్రమం లో బాల మేళా లో విద్యార్ధులు సామర్ధ్యాలను ఏ మేరకు సాధించగలిగారు అనేది అంచనా వేయవచ్చని,గణితం భాషా సామర్ధ్యాలను ఇక్కడ సామూహికంగా ప్రదర్శిస్తారు అని,విద్యార్ధులకు ఇది ఆట విడుపు గానే గాక వారి ప్రతిభాప్రదర్శనకు కేంద్రంగా ఉంటుంది అని అన్నారు.
కరకగూడెం కాంప్లెక్ష్ పరిధిలోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న బాల మేళా – 2025 బుధవారం నుండి ప్రారంభం అయ్యాయి.
స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి జి మంజుల, ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. కాంప్లెక్సు లోని వివిధ పాఠశాలల్లో ఈ బాల్ మేళా నిర్వహించ నున్నామని తెలిపారు.ప్రతిభకనబర్చిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు.పాఠశాల స్థాయిలో ఎంపికైన విద్యార్ధులతో కాంప్లక్సు స్థాయి బాల్ మేళా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ సి.ఆర్.పి జయ బాబు,రవీందర్, శ్రీనివాసరావు ,కృష్ణవేణి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.