వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తాన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవదహనమయ్యారు. వీరంతా భారతీయ యాత్రికులేనని, మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులని సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. మృతుల్లో మల్లేపల్లి, బజారాఘాట్కు చెందిన 16 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సహాయక చర్యల కోసం తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
కంట్రోల్ రూమ్ నంబర్లు:
79979 59754,
99129 19545
Post Views: 107









