విజయవాడలో మావోలు.. భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం
గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ : విజయవాడలో మావోల అరెస్టుపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కూలీలుగా చెప్పుకుని వారు పెనమలూరులో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.
ఆపరేషన్ ఖాగర్ ప్రభావంతో. మావోయిస్టులు, సానుభూతిపరులు పట్టణాళ్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు ఆరుగురు అనుమానాస్పద రీతిలో పట్టుబడ్డారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. న్యూ ఆటోనగర్లోని ఓ భవనాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్నారని నిర్ధారణ అయ్యింది. దీన్ని షెల్టర్ జోన్గా మార్చుకుని కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇవాళ మంగళవారం ఆక్టోపస్ స్పెషల్ ఆపరేషన్లో పలు ప్రాంతాల్లో 31 మంది మావోలను అరెస్టు చేశారు.
ఆటోనగర్ లో ఏర్పాటుచేసుకున్న డంప్లో ఏకే 47 సహా భారీగా డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.









