దర్శకుడు రాజమౌళిపై 3 కేసులు

గోల్డెన్ న్యూస్/  హైదరాబాద్టా :లీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో హనుమంతుడిపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు.

 

వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చోని కనిపించడంతో.. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టాడని ఒక కేసు

 

బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాడని రాజమౌళిపై మరో కేసు నమోదైనట్లు సమాచారం

 

ఇప్పటికే వారణాసి ఈవెంట్‌లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన సంఘం

Facebook
WhatsApp
Twitter
Telegram