కారులో భారీగా నగదు లభ్యం

గోల్డెన్ న్యూస్ /సికిందరాబాద్ / శామీర్‌పేటలో కారులో భారీగా నగదు లభ్యం కావడం కలకలం రేపింది. బోయిన్‌పల్లి క్రైమ్‌ పోలీసులు కారు టైరు, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల హవాలా నగదును పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి వస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు. పోలీసులు శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద  తనిఖీలు నిర్వహించారు. డబ్బును తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పోలీసులు ఏడాదిగా నిఘా ఉంచారు.

Facebook
WhatsApp
Twitter
Telegram