శబరిమల బంగారం చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. ప్రధాన పూజారి అరెస్ట్..!
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేశారు.ఆలయం నుంచి అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో శబరిమల ప్రధాన పూజారి (తంత్రి) కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీలోకి తీసుకుంది. శబరిమల ఆలయ ప్రాంగణం నుండి విలువైన బంగారు ఆభరణాలు అదృశ్యం కావడంపై దర్యాప్తు సందర్భంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
Post Views: 104









