ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా

గోల్డెన్ న్యూస్ /దమ్మపేట / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద శనివారం అర్ధరాత్రి రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న KVR ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.

ప్రయాణికులు నిద్రలో ఉండగా ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో జరిగిందో అర్థం కాక షాక్ గురి అయ్యారు. బస్సుకు సరైన ఎగ్జిట్ డోర్లు లేకపోవడంతో  ప్రయాణికులు బయటికి రాలేకపోయారు .నేషనల్ హైవే మీదుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పోలీస్ వాహనాలు, అంబులెన్సుల ద్వారా దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ ప్రాథమికంగా వెల్లడించగా, అసలు కారణాలపై రవాణాశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram