ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత జూన్ 2 నుంచి మంజూరు

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతను జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

 

పేదలకు ఉపాధి ఇబ్బందులు తలెత్తకుండా….

వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుండి 8 కి.మీ పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

 

హైదరాబాద్ పరిధిలో స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.

 

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి హెచ్చరించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram