గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ అర్హులైన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో నమోదు చేసి, అనర్హుల పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు.
– జూన్ 25, 2026 నుంచి జూలై 24, 2026 వరకు గణన ఫారమ్ల పంపిణీ, సేకరణ కార్యక్రమం కొనసాగనుంది. ఈ గడువుకు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు.
బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి గణన ఫారమ్లను పంపిణీ చేయడంతో పాటు, వాటిని పూరించడంలో ఓటర్లకు సహాయం చేస్తారు. ప్రతి ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శించనున్నారు.
బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) కూడా BLOలకు సహకరించేందుకు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని తెలిపారు.
ఓటర్లు తమ గణన ఫారమ్లను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు.
voters.eci.gov.in
SIR ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రతి ఓటరు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు.







