ఎంఈఓ కు సమ్మె నోటీసు అందజేత

ప్రభుత్వం చర్చలకు దిగిరాకపోతే డిసెంబర్ 9 నుండి సమ్మెకు వెళుతాం.

   – సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

 – ఎంఈఓ మంజులకు సమ్మె నోటీస్ అందజేత ..

గోల్డెన్ న్యూస్ కరకగూడెం: సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎంఈఓ జి మంజుల కు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష జిల్లా ఉపాధ్యక్షులు జయబాబు మాట్లాడుతూ..

రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం (టి ఎస్ ఎస్ యు) పిలుపుమేరకు రాష్ట్రంలోనే అన్ని జిల్లా కేంద్రాలలో 6,7 తేదీల్లో జిల్లా కేంద్రాల లో రెండు రోజులు నిరాహార దీక్షలు చేస్తూ చర్చలకు ప్రభుత్వం దిగిరాకపోతే డిసెంబర్ 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరూ సమ్మెకు వెళ్తున్నామని ఉద్యోగులందరూ కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి లేదా తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్* చేస్తూ మండలాధ్యక్షుడు డి గురవయ్య , ప్రధాన కార్యదర్శి విష్ణుమూర్తి, మండల మహిళా వర్కింక్ ప్రెసిడెంట్ వసుధ(కేజీబీవీ), కోశాధికారి విజయ కుమారి, ఉపాధ్యాయులు(కె జిబివి) సంధ్య, ప్రవీణ సీఆర్పీలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram