విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. 100% ఉత్తీర్ణత సాధించాలి డిడి మణెమ్మ
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం :మండలంలోని చిరుమళ్ళ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను ఐటీడీఏ డిడి మణెమ్మ గురువారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. తరగతుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆమె ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. గిరిజన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.మీరు బోధిస్తున్న దానికి విలువ ఇవ్వండి మరియు మీ విద్యార్థులు దానిని నేర్చుకోగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేయండి. ముఖ్యమైన అభ్యాసం సాధించబడిందని భావించడం విద్యార్థుల సమర్థతా విశ్వాసాలను మరింత పెంచుతుంది, కాబట్టి ఉపాధ్యాయులు తాము నేర్చుకుంటున్నది ముఖ్యమని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. పోటీ వాతావరణం కంటే సహకార సామాజిక వాతావరణాన్ని పెంపొందించుకోవాలన్నారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు .ఈ సందర్భంగా విద్యార్థులతో డి డి మాట్లాడుతూ.. కష్టపడి చదివి త్వరలో జరిగే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాక్షించారు. పై తరగతుల్లో మరింత మంచి మార్కులు సాధించే దిశగా ప్రయత్నించాలని, తమ తోటి వారికి కూడా మంచి విద్య అందించేందుకు తోడ్పాటు అందించాలన్నారు. త్వరలో జరగనున్న పరీక్షల్లో వందశాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Post Views: 52









