కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండలంలోని  వట్టం వారి గుంపు పంచాయతీ,  కరకగూడెం పంచాయతీ, భట్టుపల్లి పంచాయి నుండి వివిధ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ సభ్యులు మొత్తం 30 కుటుంబాలు ఆదివారం  పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram