రాష్ట్ర సాధన కోసం వ్యూహాలు రచించిన గదిలోనే.. నేడు విచారణ.

⇒తెలంగాణ కోసం ఊపిరిపోసిన గదిలోనే విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరం

⇒ కేసీఆర్ భావోద్వేగ వ్యాఖ్యలు

 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్న భోజన విరామ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తాను ఊపిరిపోసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమానికి రూపకల్పన చేసిన గదిలోనే నేడు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు.

 

రాష్ట్ర సాధన కోసం అదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌పై అనేక కీలక చర్చలు అక్కడే జరిగాయని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు అవసరమైన వ్యూహాలు, నిర్ణయాలు అన్నీ అదే గదిలోనే రూపుదిద్దుకున్నాయని చెప్పారు.

 

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేశానని కేసీఆర్ అన్నారు. అలాంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన గదిలోనే ఇప్పుడు విచారణ ఎదుర్కోవడం తనకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని తెలిపారు. ఇది తన జీవితంలో ఎదురైన అత్యంత దురదృష్టకరమైన ఘట్టమని వ్యాఖ్యానించారు.

 

ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉద్యమ నేతగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన భావోద్వేగ ప్రసంగం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram