– విద్యార్థులకు దుప్పట్లు, స్వెటర్స్ పంపిణీ చేయాలి..
– ఎన్ఎస్ఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ డిమాండ్
గోల్డెన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రలో చలి తీవ్రత పెరుగుతున్నందున తెలంగాణ గురుకుల విద్యార్థులకు దుప్పట్లు షట్టర్లు పంపిణీ చేయాలని, ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ సిఎస్ టి బీసీ మరియు కస్తూర్భా గురుకులలో, ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చలి తీవ్రత వల్ల అనారోగ్యం పాలవుతారని దీన్నిి దృష్టటిలో ముందుగాానే చర్యలు చేపట్టాలన్నారు, అలాగే చాలా వసతి గృహాల్లో కిటికీలు, వెంంటలేటర్లు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అన్ని వసతులతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్ ,బాడిశ సుహష్,జాడి దినేష్ దుర్గం సురేందర్ గోగు సాంబశివరావు, జాడి వినయ్ దుర్గం ప్రసాద్ గోగు సాయి తదితరులు పాల్గొన్నారు.