రాష్ట్ర వ్యాప్తంగా 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని 2096 పంచాయతీలకు ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్ టెలిఫోన్ పలు ఓటిటి సినిమాలు చూడవచ్చు. 20 ఎంబిపిఎస్ స్పీడ్ తో నడవనున్నట్లు తెలిపారు. త్వరలోనే అన్ని గ్రామాలకు దీన్ని విస్తరించనున్నారని అధికారులు తెలిపారు..
Post Views: 44