అర్హులకే ఇందిరమ్మ ఇల్లు .. కలెక్టర్

గోల్డ్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : అర్హులు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, పెండింగ్ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, ధరణి దరఖాస్తులపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మాత్రమే ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు మరియు పంచాయతీ కార్యదర్శి లు సమన్వయంతో పనిచేసే దరఖాస్తులు పరిశీలన చేపట్టాలన్నారు. ఎల్ వన్, ఎల్ టు,ఎల్ త్రీ లిస్టులను తయారు చేయాలని ఆదేశించారు. నివేదికలు ఆమోదం పొందిన వెంటనే ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఎల్ వన్ లో అర్హత లేని వారిని పరిశీలించి తొలగించాలని, తొలగించడానికి గల కారణాలను నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కు అర్హత కలిగి ఉండి ఎల్ వన్ జాబితాలో పేరు రాని అర్హుల పేర్లను కూడా నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా ఎల్ టు మరియు ఎల్ త్రీ లో పేర్లు పొందుపరచడానికి గల కారణాలను కూడా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో తండ్రికి పేరు వచ్చి పెళ్లి అయిన కొడుకు దరఖాస్తు చేసిన అర్హత ఉండి జాబితాలో రానటువంటి దరఖాస్తులను కూడా పరిగణలోనికి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తండ్రి పక్క గృహంలో నివసిస్తూ వివాహం అయిన కొడుకు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు అర్హత కలిగి ఉంటే అటువంటి వాటిని కూడా పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. ఎల్ వన్ అంటే శాశ్వత ఎలిజిబిలిటీ లిస్ట్ అని అయినా స్పష్టం చేశారు. ఎంపీడీవోలు పూర్తి బాధ్యతగా వ్యవహరించి అర్హత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో జాబితాలో రాకుండా చూడాలని ఆదేశించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram