కన్న బిడ్డను వదిలేసి ప్రియుడితో మహిళ జంప్

గోల్డెన్ న్యూస్ / నల్లగొండ : పట్టణంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మాయలో పడి ఓ మహిళ తన కొడుకును బస్టాండ్ లో వదిలేసి ప్రియుడితో పరారయింది . బాబును గుర్తించిన  ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు  వివరాల మేరకు… నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఓ మహిళ 15 నెలల బాబును వదిలేసి.. వేరే యువకుడితో బైక్ పై వెళ్లింది. పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో.. హైద్రాబాద్ కు చెందిన నవీన అనే మహిళ ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. మహిళకు 15 నెలల బాబు ధనుష్ ఉన్నాడు. ఈ క్రమంలోనే.. భర్తను, నెలల పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు ప్లాన్ వేసింది. డైరెక్ట్ గా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ కు బాబుతో పాటు వచ్చి.. ఆ బాబును బస్టాండ్ లో వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత.. బాలుడు తల్లి కోసం  ఏడవడం చూసిన ప్రయాణికులు, డిపో సిబ్బంది.. నల్లగొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ ఎస్సై సైదులు వెంటనే స్పందించి.. స్టేషన్ లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్ కు పంపారు. పోలీసులు.. బస్టాండ్ లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. బైక్ మీద వెళుతున్న ఓ మహిళ వీడియోను చూసి.. ఆ బాలుడు “మమ్మీ” అంటూ గుర్తించాడు. బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా.. విచారణ చేపట్టిన పోలీసులకు.. బైకు యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్లు తేలింది.. ఆ కోణంలో విచారణ చేపట్టగా. భర్తను పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బయటపడింది. అనంతరం.. మహిళను, ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడిని.. ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కి పిలిపించి.. కౌన్సెలింగ్ ఇచ్చి.. బాలుడు తండ్రికి పిల్లాడిని అప్పగించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram