పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 6 గురు వ్యక్తులపై కేసులు న‌మోదు

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని భట్టుపల్లి  గ్రామంలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు  బుధవారం కరకగూడెం పోలీసులు  దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో భాగంగా 1 ఆటో  2 సెల్‌ఫోన్ల‌తోపాటు రూ.3 వేలు నగదు స్వాధీనం చూసుకొని ఆరుగురు కేసు నమోదు చేసినట్లు కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు తెలిపారు .పేకాట, కోడి పందేలు వంటి జూద క్రీడలు ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram