♦ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
♦ కొత్తగూడ ఎస్. ఐ రాజుకుమార్
గోల్డెన్ న్యూస్ / కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్ . ఐ రాజు కుమార్ సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్సై మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన వీడియోలు మరియు సైబర్ క్రైమ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లను ప్రదర్శించి, సదస్సుకు హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుడ్ టచ్,”బ్యాడ్ టచ్ , స్వీయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మరియు చట్టాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, అవగాహన తోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.అనంతరం సైబర్ నేరాల పై అవగాహన వీడియోలను వాట్సప్ ద్వారా షేర్ చేశారు. సదరు వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కఅషి చేయాలన్నారు. సైబర్ నేరాల పై రిపోర్ట్ కొరకు సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 సంప్రదించాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి , సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) లో నమోదు చేయండి. విద్యార్థిని,విద్యార్థులంతా నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మద్యం సేవించే వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు… ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు…









