ఇంట్లో నిల్వ ఉంచిన బాణాసంచా పేలి .. నలుగురు మృతి

దీపావళి పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది.

ఓ ఇంట్లో నిల్వ ఉంచిన క్రాకర్స్ పేలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సమీపంలోని తిరువళ్లూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంట్లో క్రాకర్స్ నిల్వ ఉంచినట్లు చెబుతున్నారు. దీపావళి సందర్భంగా పెద్ద మొత్తంలో టపాసులు విక్రయించి.. నిల్వ ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అవి ఒక్కసారిగా పేలడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యింది. స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. కొద్ది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

 

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో క్రాకర్స్ నిల్వ చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని తేలింది. క్రాకర్స్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులు కూడా ఇంట్లో ఉన్నట్లు విచారణలో బయటపడింది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram