నేటి నుంచి వైన్స్ బంద్

గమూడు విడతల్లో మద్యం నిషేధం

ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సెజ్ అధికారులు తెలిపారు.

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలపై అధికారులు కఠిన నిషేధం విధించారు. పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

 

మొదటి విడత: డిసెంబర్ 9 నుంచి నిషేధం

 

డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి,

డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు తొలి విడత ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,236 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.

 

రెండవ విడత: డిసెంబర్ 12–14

 

డిసెంబర్ 14న జరిగే రెండవ విడత పోలింగ్ కోసం డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14 ఫలితాలు వచ్చేంత వరకు ఆయా గ్రామాల్లో మద్యం నిషేధం అమలు ఉంటుంది.

 

మూడవ విడత: డిసెంబర్ 15–17

 

మూడవ విడత ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయి.

దీంతో సంబంధించి, డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 17 ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రాంతంలోని అన్ని వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసివేయాలని అధికారులు స్పష్టం చేశారు.

 

బార్లు, రెస్టారెంట్ల మీద కూడా ఆంక్షలు

 

ఈ నిషేధం కేవలం వైన్ షాపులకే పరిమితం కాదు.

 

బార్లు. మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు  ఈ నిషేధానికి లోబడి ఉంటాయని కలెక్టర్లు స్పష్టంగా తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 

 

ఎవరైనా దుకాణాలు దొంగచాటుగా మద్యం విక్రయించినా, లేదా నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఎన్నికల ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచినట్లు వెల్లడించారు.

 

ఎన్నికలకు ఉత్సాహంగా పాల్గొన ప్రజలు

 

 దాదాపు రెండు సంవత్సరాల  అనంతరం జరగనున్న  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు, అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలతో గ్రామాల భవిష్యత్తు రూపుదిద్దుకోనుంది.

పోలింగ్ జరిగిన రోజే సాయంత్రం ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram