జనసంద్రంగా మేడారం.. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క- సారలమ్మ

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం మహాజాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మేడారం జనసంద్రంగా మారింది. దీంతో అక్కడి రహదారులన్నీ రద్దీగా మారాయి. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు భక్తిశ్రద్ధలతో గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram