విద్యుదాఘాతంతో రైతు మృతి

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /కరకగూడెం మండల తాటి గూడెం గ్రామంలో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందిన ఘటన చోటు గురువారం చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చందా ప్రసాద్(30) అతని వరి పొలానికి వెళ్ళాడు. అక్కడ విద్యుత్ మోటర్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య పూర్ణిమ ముగ్గురు పిల్లలు శాన్వి , జ్ఞానేశ్వర్, శాన్విత ఉన్నారు ..

Facebook
WhatsApp
Twitter
Telegram