గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/ భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకను తిలకించేందుకు ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రాంగణమంతా రామ నామస్మరణతో మార్మోగుతోంది.మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లు పాయం వెంకటేశ్వర్లు, తెల్ల వెంకటరావు, కొమరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Post Views: 514









