కడుపునిండా అన్నం పెట్టమన్నందుకు ఆగ్రహించిన ప్రిన్సిపాల్ !?

గురుకుల పాఠశాలలో దాష్టీకం..

కడుపూనిండా అన్నం పెట్టమన్నందుకు..

మోకాళ్లపై కూర్చోబెట్టిన వైనం

 

ఆకలవుతుంది కడుపునిండా అన్నం పెట్టమన్నందుకు  ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

 

మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్‌లో నిర్వహిస్తున్న దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో సోమవారం రాత్రి భోజనం సమయంలో అన్నం సరిపోలేదు. ఆకలి అవుతుంది కడుపునిండా అన్నం పెట్టండి అని విద్యార్థినిలు ప్రాధేయపడ్డారు. ఆ ఒక్క మాటతోనే పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై  ఆగ్రహించిన ప్రిన్సిపాల్  తిట్ల దండకం చేశారు.

 

అంతటితో ఆగకుండా మోకాళ్లపై కూర్చోబెట్టి విద్యార్థులను వేధించారని తెలిసింది. కనీసం ఆ తర్వాత నైనా భోజనం పెట్టారంటే అది కూడా లేకుండానే ఆ రాత్రంతా ఖాళీ కడుపుతో పడుకోబెట్టారు.

 

తల్లిలా ఆదరించాల్సిన ప్రిన్సిపాల్ విద్యార్థులను మానసిక శారీరక వేధింపులకు గురిచేస్తున్న తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

అనంతరం ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్‌తో పాటు మిగతా వాళ్లందరిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది

Facebook
WhatsApp
Twitter
Telegram