కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ కాన్వాయ్పై దాడి జరిగింది. కేరళలోని మలప్పురంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం కోసం ఆయన వండూర్కు వచ్చారు. ఈ క్రమంలో బైక్ల మీద వచ్చిన కొందరు వ్యక్తులు ఎంపీ కాన్వాయ్ని అడ్డుకున్నారు. థరూర్ను దూషిస్తూ దాడికి యత్నించారు. ఈ దాడిని ఆయన గన్మెన్ అడ్డుకోగా అతడిపై దాడి చేశారు. ఈ మేరకు శశిథరూర్ గన్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Post Views: 15









