అరుదైన ఘటన.. ఇద్దరి వేలిముద్రలు ఒకేలా
సాధారణంగా ఏ ఇద్దరి వేలిముద్రలు, రెటీనా సరిపోలవు. కానీ యూపీలోని కాన్పూర్ లో ప్రబల్, పవిత్ర మిశ్రా అనే కవలల ఫింగర్ ప్రింట్స్, రెటీనాలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు.
ఒకరి ఆధార్ అప్డేట్ చేస్తే మరొకరిది డీయాక్టివేట్ అవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జన్యుపరంగా ఇది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఇది సాంకేతిక లోపమా లేక నిజంగానే బయోమెట్రిక్స్ సరిపోయాయా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.
Post Views: 61









