వారసుడి కోసం. భార్య, కూతుర్లును కడతేర్చాడు

హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన

మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య ఇద్దరు కూతుళ్లను హతమార్చిన భర్త

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ, భార్య ఫర్హాత్(26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా(6)తో నివాసం ఉంటున్న అజారుద్దీన్ అనే వ్యక్తి

 

ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన అనంతరం, ఫర్హాత్ రెండు సార్లు గర్భం దాల్చగా, ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అబార్షన్ చేయించిన అజారుద్దీన్

 

నాలుగేళ్ల అనంతరం మళ్లీ గర్భవతి కాగా, ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్యను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసిన భర్త

 

దానికి ఆమె అంగీకరించకపోవడంతో, భార్య పిల్లలను తమ స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి, అందులో తోసేసి హత్యచేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన అజారుద్దీన్

 

ఫర్హాత్ తండ్రి అజారుద్దీన్ పట్ల అనుమానం ఉందని తెలపడంతో, అతన్ని అదుపులోకి తీసుకుని విచారించి, తానే హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు••

Facebook
WhatsApp
Twitter
Telegram