ఒంటికి నిప్పంటించుకున్న టివీకే కార్యకర్త

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో మనస్తాపం చెందిన టీవీకే కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

 

తిరునెల్వేలి జిల్లాలోని సెట్టికుళం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడున్న వారు మంటలార్పి అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

 

అనంతరం మెరుగైన చికిత్స కోసం కన్యాకుమారి వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని ఇసక్కియప్పన్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు పుతుమనై గ్రామ టీవీకే కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram