వడదెబ్బతో వృద్ధురాలి మృతి

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం  / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామానికి చెందిన నడ్డి భద్రమ్మ (70) ఆదివారం వడదెబ్బకు గురై మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తీవ్ర ఎండల కారణంగా ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని తెలిపారు. నిద్రమ్మ మృతితో ఆ కుటుంబం విషాదఛాయలు అలుముకున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram