ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా జడ్జి

గోల్డెన్ న్యూస్ /కొత్తగూడెం / ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సందర్భంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి జి. ప్రేమలత, అధికారులు, అటవీ శాఖ డివిజన్ అధికారి బి. బాబు, అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా జిల్లా వాతావరణ న్యాయాధికారి సమతుల్యతను మాట్లాడుతూ, కాపాడేందుకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి పెంచాలని పిలుపునిచ్చారు. అనంతరం కోర్టు ప్రంగాణం నుండి పోస్ట్ అఫిస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, సభ్యులు, న్యాయవాదులు, అటవీ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, కోర్టు ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ పలు సందేశాలను అందించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram