గోల్డెన్ న్యూస్ /మెదక్ / చేగుంట మండలం పోలంపల్లి గ్రామ సర్పంచ్ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సర్పంచ్గా గెలుపొందిన రాజ్యలక్ష్మి భర్త స్వామి హరితహారం మొక్కలు నరికివేయడం, పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేయడం, మరుగుదొడ్లను కూల్చి వేయడంతోపాటు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయడం వంటి పనులకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Post Views: 605








