4 సంక్షేమ పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్

నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించింది. నారాయణపేట జిల్లా కోస్గి (M) చంద్రవంచ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సంక్షేమ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram