ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : మండలంలోని చొప్పల పంచాయితీ మురికిమడుగు వద్ద ప్రధాన రహదారిపై సోమవారం ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఎదురు ఎదురుగా ఢీకొని భట్టుపల్లి గ్రామానికి చెందిన ఖదీర్ అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయమైంది.108 వాహనంలో కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం  మెరుగైన వైద్యం కోసం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram