గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల మిమ్స్ జూనియర్ కాలేజీలోని హాస్టల్ భవనంపై నుంచి కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. మూడవ అంతస్తులో ఉన్న హాస్టల్ లో రాత్రి భోజనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తోటి విద్యార్థినులు తెలిపారు. కాగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన విద్యార్థినిని బైపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న సహస్రగా పోలీసులు గుర్తించారు.
Post Views: 162