సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ

గోల్డెన్ న్యూస్ / ఏటూరు నాగారం / తెలంగాణ రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. స్థానిక సంస్థలతోఎన్నికలతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. పోర్టులో ఉన్న సర్పంచ్‌గా ఎలాగైనా గెలిచేందుకు గ్రామస్తులకు తాయిలాలు, వినూత్న రీతిలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్‌గా తనను గెలిపిస్తే  గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ పెట్టిస్తానని హామీ ఇచ్చిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి పై హామీలతో కూడిన బాండ్ రాసిచ్చారు. పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్థులకు తెలియజేస్తానని పేర్కొన్నారు. గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని, సైడు కాలువలు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram