హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలోని మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఈ ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.

స్థానికులు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు చెప్పిన ఈ ఘటన పక్క పొరుగువారిలో భయాందోళన రేకెత్తించింది.

గాజుల రామార్‌లోని మెట్ కాన్ గూడ నివాసితులు భూకంపాన్ని అనుభవించిన సందర్భంలో, ఇంట్లోని వస్తువులు కదిలిపోయి, పెద్ద శబ్దంతో భూమి ఉలిక్కిపడినట్లు తెలిపారు.

కొందరు పెద్ద శబ్దం వినిపించిన వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారని చెబుతున్నారు. అయితే, ఇది భూకంపమేనా లేదా ఇతర పేలుళ్ల కారణమా అనే అంశంపై స్పష్టత ఇంకా రాలేదు.

Facebook
WhatsApp
Twitter
Telegram